బాలయ్య తనకు తండ్రి లాంటి వారన్న నయనతార..!

బాలయ్య తనకు తండ్రి లాంటి వారన్న నయనతార..!


నందమూరి బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలూ హిట్సే..! సింహా, శ్రీరామరాజ్యం సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ‘జైసింహ’. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్రబృందం భావిస్తోంది.ఈ సినిమా గురించి నయనతార మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణతో సినిమాలు వరుసగా చేయడానికి.. ఆయనంటే ఎందుకు అంత అభిమానమో చెప్పింది. బాలయ్యను తాను తండ్రిలా భావిస్తానని చెప్పింది. ఆయనను చూస్తే గౌరవంతో రెండు చేతులు జోడించి, దండం పెట్టాలనిపిస్తుందని తెలిపింది. బాలయ్యతో కలసి నటించడమంటే తనకు ఎప్పుడూ ఇష్టమేనని చెప్పింది. బాలకృష్ణ తనకు ఎప్పుడూ సొంత కుటుంబ సభ్యుడిగానే కనిపిస్తారని తెలిపింది. బాలయ్య చాలా మంచివాడని ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడని సినీ పరిశ్రమలో ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అందుకే బాలయ్యతో నటించడం తమకు చాలా ఇష్టం అని పలువురు కథానాయికలు చెబుతూ ఉంటారు. జై సింహా సినిమాలో నయనతారతో పాటుగా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు.






Comments