విశాఖ ఉత్సవ్ కు సాగరతీరం ముస్తాబు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంటా.
విశాఖ ఉత్సవ్ కు సాగరతీరం ముస్తాబవుతోంది.
ఏర్పాట్లును మంత్రి గంటా శ్రీనివాస్ రావు పరిశీలించారు. ఫ్లవర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించేలా ప్రణాళికలు సిద్దం చేశారు. విశాఖ సాగరతీరం
వేదికకగా మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సినీ తారాగణం కూడా తరలివస్తోంది. సినీ ప్రముఖులు
రావడం విశాఖ ఉత్సవాలకు హైలెట్ గా నిలుస్తాయని మంత్రి గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. 29వ తేదీన సినీ
తారలు హాజరవుతున్నారని తెలిపారు. మొదటి రోజున అసెంబ్లీ స్పీకర్ కోడేల శివప్రసాద్ వస్తున్నారని
తెలిపారు.

Comments
Post a Comment