32సంవత్సరాలుగా బాధతో బ్రతుకుతున్న మహిళ.. ఎక్స్ రే తీసి చూడగా మూర్చపోయిన భర్త.. ఎలా ఆపరేషన్ చెయ్యాలో తెలియక సతమతమవుతున్న డాక్టర్స్

32సంవత్సరాలుగా బాధతో బ్రతుకుతున్న మహిళ.. ఎక్స్ రే తీసి చూడగా మూర్చపోయిన భర్త.. ఎలా ఆపరేషన్ చెయ్యాలో తెలియక సతమతమవుతున్న డాక్టర్స్ 



32 సంవత్సరాలుగా ఆమె ఎంతో నొప్పిని భరిస్తూ బ్రతికింది. చూడడానికి బాగున్నా ఏదో ఒక నొప్పి అని చెబుతుండేది. కానీ.. ఆమె బాధను ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఆమెకు పిచ్చి పట్టింది.. ఏమీ లేకున్నా కూడా నొప్పి నొప్పి అని చెబుతోంది అని అందరూ అనుకున్నారు. చివరికి ఇప్పుడు ఆమె ఎక్స్ రే తీయించగా 22 సూదులు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమె భర్త షాక్ కు గురయ్యాడు. ఆమె శరీరంలోకి అన్ని సూదులు ఎప్పుడు ఎలా వచ్చాయా అన్నది ఎవరికీ తెలీదు. దాదాపు 32 సంవత్సరాలుగా ఆమె బాధతో బ్రతుకుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని గోరఖ్ పూర్ కు చెందిన షాయరా అనే మహిళ జీవితంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె గోరఖ్ పూర్ లోనూ, ఢిల్లీలోనూ పలువురు వైద్యులను సంప్రదించింది.. కానీ వారు ఆమెకు ఏమైందో గుర్తించలేకపోయారు. షాయరా తన భర్త, నలుగురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఆమెకు ఎహసాన్ అలీతో 1985లో పెళ్ళి అయింది. ఆమెకు అప్పటి నుండి తనకు ఏదో అవుతోంది.. శరీరంలో ఏదో నొప్పిగా ఉంది అని చెప్పుకుంటూ ఉండేది. 1986 నుండి 2008 వరకూ పలు ఆసుపత్రులకు తీసుకొని వెళ్ళాడు ఆమె భర్త. చాలా మంది ఆమెకు మైండ్ సరిగా పనిచేయడం లేదని చెప్పారు. 2008లో ఢిల్లీ లోని ఎయిమ్స్ కు కూడా తీసుకొని వెళ్ళారు కానీ అక్కడ ఎటువంటి లాభం లేదు. ఆమె రిపోర్ట్ ను చూసి ఏ డాక్టర్ కూడా ఓ అంచనాకు రాలేకపోయారు. అప్పుడు ఆమె శరీరం నుండి కొన్ని సూదులు బయటకు వచ్చాయి. వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయగా ఏకంగా ఆమె శరీరం లో 22 సూదులు ఉన్నట్లు తెలిసింది. దీంతో వైద్యులు ఆమెకు ఎలా వైద్యం చేయాలా అని తలపట్టుకున్నారు. ఆమె శరీరంలోని చాలా భాగాలలో ఈ సూదులు ఉండడంతో ఎలా లోపలి వెళ్ళాయా అన్నది కూడా అంతు చిక్కడం లేదు.





Comments